ఏపీలో టీడీపీ నాయకుడి దారుణ హత్య

-

ఏపీలోని తిరుపతి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిల్లకూరు మండలం నాంచారం పేటలో మల్లారపు హరిప్రసాద్ (20) తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. పాత రాజకీయ కక్షలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. హరిప్రసాద్ నిద్రిస్తుండగా ప్రత్యర్థులు ఒంటి మీద పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం.

ఒక్కసారి మంటలు అంటుకోవడంతో కాపాడండి.. కాపాడండి.. అని గట్టి గట్టిగా అరుస్తూనే హరిప్రసాద్ మృతి చెందినట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునేలోపే హత్యకు కారణమైన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం హరిప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version