బీఎస్పీ RS ప్రవీణ్ కుమార్: TSPSC పేపర్ లీక్ లో కేటీఆర్ కు నోటీసులు ఇవ్వాలని డిమాండ్… రాష్ట్రపతికి కంప్లైంట్ చేస్తాం !

-

తెలంగాణలో జరిగిన TSPSC పేపర్ లీక్ పై రాజకీయంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు SIT అధికారులు దొరికిన వారిని విచారిస్తూ మరింత సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ కీలకమైన సమాచారాన్ని తెలుసుకున్నారు. కాగా తాజాగా బీఎస్పీ కి చెందిన ప్రవీణ్ కుమార్ కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. TSPSC పేపర్ లీక్ ఘటనలో ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక కేసు గా దీనిని నమోదు చేయలేదు అంటూ ప్రశ్నించారు.

పైగా ఈ లీక్ కు సంబంధించి న్యాయం అడుగుతున్న నిరుద్యోగుల పైన ప్రభుత్వం కేసులు పెట్టడం దారుణం అంటూ చెప్పారు. ఈ ఈ విషయాన్ని రాష్ట్రపతికి దృష్టికి తీసుకువెళతామన్నారు వెంటనే చైర్మన్ కు నోటీసులు ఇవ్వాలని అలాగే కేటీఆర్ కి సైతం నోటీసులు ఇవ్వాలని బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news