తెలంగాణలో కరోనా టెర్రర్..ఒక్క రోజే 45 కేసులు నమోదు

-

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 45 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో 18 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేసీఆర్‌ సర్కార్‌ అలర్ట్‌ అయింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది.

కాగా..నటుడు పోసాని కృష్ణ మురళికి తాజాగా కరోనా సోకింది.దీంతో హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చేరారు పోసాని కృష్ణ మురళి. పూణేలో జరిగిన షూటింగ్లో పాల్గొని నిన్ననే హైదరాబాదుకు వచ్చిన పోసాని కృష్ణ మురళికు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. అయితే.. కృష్ణ మురళికి కరోనా పాజిటివ్‌ రావడం ఇది మూడోసారి.

Read more RELATED
Recommended to you

Exit mobile version