ఏపీ ప్రభుత్వానికి మోడీ మరో శుభవార్త..

-

జగన్ సర్కార్ కు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాకినాడ, గోదావరి జిల్లాలోని కేపీ పురంలో ఈ పార్కు ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు బల్క్ డ్రగ్ పార్క్ కు ఆమోదం తెలుపుతూ కేంద్రం ఏపీకి లేఖ రాసింది. బల్క్ డ్రగ్ పార్క్ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక సైతం పోటీ పడగా ఏపీకి ఆ అవకాశం దక్కింది.

ఈ మేరకు సి.ఎస్ సమీర్ శర్మకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శి ఎన్.యువరాజు మంగళవారం లేఖ రాశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కొత్త పెరుమల్లపురం, కోదాడ గ్రామాల పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు ఇచ్చింది.

ఈ ప్రతిపాదనకు స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని లేఖలో ప్రస్తావించారు. బల్క్ డ్రగ్ పార్కుల ప్రోత్సాహక పథకం కింద ప్రతిపాదిత పార్కులో ఉమ్మడి మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం గ్రాంటు అందజేస్తుందన్నారు. స్టీరింగ్ కమిటీ నిర్ణయం ఆమోదయోగ్యమో కాదో 7 రోజుల్లో గా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news