ఈనెల 6న చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ.. ఆర్ అండ్ బి అధికారులతో కోమటిరెడ్డి రివ్యూ

-

ఈ నెల 6వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ కాబోతుండటం ఆసక్తిగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో పది సంవత్సరాలుగా అపరిష్కృతంగా మారిన విభజన అంశాలకు ఓ పరిష్కార మార్గం దొరకవచ్చు అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

ఈ క్రమంలో మంగళవారం సచివాలంయంలోని తన చాంబర్ లో ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక రివ్యూ నిర్వహించారు. సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీలో చర్చించాల్సిన విభజన అంశాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ పరిధిలోని ఆస్తుల వివరాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. లేక్ వ్యూ, గ్రీన్ ల్యాండ్స్, మంజీరా అతిథి గృహాలపై మంత్రి కోమటిరెడ్డి చర్చించారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్లపై మంత్రి వెంకట్ రెడ్డి సమీక్షలో అధికారులతో చర్చించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version