అండగా నేనున్నా భయపడకు : చంద్రబాబు

-

ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ గా రాజకీయం నడుస్తోంది. టీడీపీ నేతలపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తుంటే.. వైసీపీ నేతలపై కూడా అదే రేంజ్ లో టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి వైసీపీ ప్రభుత్వం వాళ్ళ నేను మోసపోయానంటూ ఓ టీడీపీ కార్యకర్త మొరపెట్టుకున్నాడు. దీంతో భయపడాల్సిన అవసరం లేదని, తాను అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబును కర్నూలు జిల్లా, కృష్ణగిరి మండలం అలంకొండకు చెందిన సుధాకర్ అనే టీడీపీ కార్యకర్త కలిసాడు.

తన 33 ఎకరాల భూమిని ఆన్ లైన్లో పేరు మార్చి కాజేశారని చంద్రబాబు దృష్టికి తెచ్చిన సుధాకర్.. తన భూమిని వేరే వ్యక్తుల పేర్ల మీదకు మార్చేశారని చంద్రబాబుకు వివరించాడు. అంతేకాకుండా తహసీల్దార్ సహా కలెక్టర్ వరకు ఫిర్యాదు చేసినా న్యాయం చేయలేదని సుధాకర్ కన్నీటి పర్యంతమయ్యాడు. తనకు న్యాయం జరిగేలా చూడాలని బాధితుడు సుధాకర్ చంద్రబాబును కోరాడు. దీంతో స్పందించిన చంద్రబాబు అండగా ఉంటానని హామీ ఇచ్చి సమస్య పరిష్కరిస్తానన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news