మంత్రి రోజా ఇలాకాలో చంద్రబాబు రోడ్‌ షో..

-

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలోని జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో.. శుక్ర‌వారం ఆయ‌న చిత్తూరు జిల్లాలో వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌ రోజా నియోజకవర్గమైన న‌గ‌రిలో ప‌ర్య‌టించారు. ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి రోజా సొంత నియోజ‌కవ‌ర్గ‌మైన న‌గ‌రిలో చంద్ర‌బాబు చేప‌ట్టిన రోడ్ షోకు భారీ సంఖ్య‌లో జ‌నం హాజ‌ర‌వడం విశేషం. ఫ‌లితంగా న‌గ‌రిలోని ప్ర‌ధాన ర‌హ‌దారులు జ‌న సందోహంతో నిండిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

Image

న‌గ‌రి రోడ్ షోలో భాగంగా ప‌ట్ట‌ణంలోని ఎన్టీఆర్ కూడ‌లిలో బాదుడే బాదుడు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు చంద్ర‌బాబు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైసీపీ స‌ర్కారుపై విమర్శలు గుప్పించారు. మూడేళ్ల పాల‌న‌లో జ‌గ‌న్ నిర్ణ‌యాల వ‌ల్ల ఒక్క‌రైనా సంతోషంగా ఉన్నారా? అని ప్ర‌శ్నించారు చంద్ర‌బాబు. పెగాస‌స్ వినియోగించాన‌ని త‌న‌పై కేసులు పెట్టేందుకు జ‌గ‌న్ స‌ర్కారు య‌త్నిస్తోంద‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. తాను ప్ర‌జ‌ల‌కు భ‌య‌ప‌డతాను త‌ప్పించి కేసుల‌కు కాద‌ని స్పష్టం చేశారు చంద్ర‌బాబు.

 

Read more RELATED
Recommended to you

Latest news