వచ్చే ఎన్నికల్లో గెలిస్తే…30 ఏళ్లూ మనదే అధికారం – సీఎం జగన్

-

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే.. వచ్చే ౩౦ ఏళ్లూ మనదే అధికారం అంటూ ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెక్కలి నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మరో 18 నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని… ఇవ్వాళ్టి నుంచి అడుగులు కరెక్టుగా పడితేనే.. మనం క్లీన్‌స్వీప్‌ చేయగలుగుతామని చెప్పారు.

అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు 175 కి 175 నియోజకవర్గాలు ఎందుకు మనం కొట్టలేమా ?తప్పకుండా గెలవగలుగుతామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోగలిగితే.. 87శాతం ఇళ్లకు మంచి చేశామని తెలిపారు.చాలా నియోజకవర్గాలకు సంబంధించిన ఇలాంటి సమీక్షా సమావేశాలు జరుగుతూ ఉన్నాయని.. గతానికి భిన్నంగా పరిపాలన కొనసాగుతోందన్నారు. మంచి చేశామని సగర్వంగా తలెత్తుకునేలా మన పరిపాలన జరుగుతోందని.. వెల్లడించారు. ప్రతి గ్రామంలోనూ, నియోజకవర్గంలోనూ కార్యకర్తలుగా, నాయకులుగా మనం చేసే పని మనం చేయాలి.. ప్రతి గడపకూ వెళ్లాలి.. మనంచేసిన మంచిని వారికి గుర్తుచేయాలి, వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version