భారత్‌పై చైనా మరోసారి ప్రశంసలు.. ఆ కారణం వల్లేనా?

-

భారత్‌పై చైనా మరోసారి ప్రశంసల వర్షం కురిపించింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ అందిస్తోన్న సాయానికి మెచ్చుకుంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియానో బుధవారం మాట్లాడారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ అందిస్తోన్న సహాయం ప్రశంసనీయమన్నారు. శ్రీలంక విషయంలో భారత్ చేస్తున్న సాయం అభినందనీయమన్నారు. శ్రీలంకతోపాటు ఇతర దేశాలకు సహాయ సహకారాలు అందిస్తోందన్నారు.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియానో
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియానో

శ్రీలంక అధ్యక్షుడు గోటాభయ రాజపక్సే చేసిన వ్యాఖ్యలకు చైనా విదేశాంగ మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీలంక విషయంలో భారత ప్రభుత్వం చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. భారతదేశంలా ఇతర దేశాలు కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు. అన్ని దేశాలతో కలిసి పని చేయడానికి చైనా సిద్ధంగా ఉందన్నారు. దీనికి చైనా ప్రభుత్వం తమ వంతు కృషి చేస్తుందన్నారు. శ్రీలంక దేశానికి సహాయం చేయడానికి అన్ని రకాలుగా ముందుకు వస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news