సీఐ నాగేశ్వరరావు, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుడే – రేవంత్ రెడ్డి

-

ఇటీవల రేప్ కేసు నిందితుడైన సీఐ నాగేశ్వరరావు కెసిఆర్ కుటుంబం కి ఎంతో సన్నిహితుడని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాడిసన్ పబ్ వివరాలు అన్ని సీఐ నాగేశ్వరరావు దగ్గరే ఉన్నాయని,దాంట్లో యువరాజు చిట్టా అంతా ఉందని,ఈ కేసులో నన్ను ఇరికిస్తే… నిన్ను పబ్ కేసులో ఇరికిస్త అని బెదిరిస్తున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు.పోలీస్ అత్యాచారం చేస్తే పట్టుకోలేక పోతుందా ఈ వ్యవస్థ అంటూ ప్రశ్నించారు. సీఐ నాగేశ్వరరావు కేసు తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోందన్నారు.

ప్రభుత్వం ఆ అమ్మాయి మీద వ్యభిచారం కేసు పెట్టే ఆలోచన చేస్తుందన్నారు.భర్త మీద బ్లాక్ మెయిల్ కేసు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.విమలక్క పై ఉమ్మడి రాష్ట్రంలో కేసులు పెట్టే దైర్యం కూడా చేయలేదని,తెలంగాణ వచ్చాక విమలక్క మీద కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రజల అవేదన అర్దం చేసుకుని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని,తెలంగాణ ఇచ్చినా అధికారం రాదని ఆంధ్ర నాయకులు అన్నారని తెలిపారు.వాళ్ళ మాటలు నిజం చేయడం కాదు,తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ కి విజ్ఞత చుపించుకోవలి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news