BREAKING: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్

-

CM Arvind Kejriwal approaches Delhi High Court: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు సిఎం అరవింద్ కేజ్రీవాల్. తీహార్ జైల్లో ఉన్న తనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరో రెండు అదనపు సమావేశాలకు అనుమతి ఇవ్వాలని కేజ్రివాల్ పిటిషన్ దాఖలు చేశారు.

CM Arvind Kejriwal approaches Delhi High Court

జైలు అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేజ్రివాల్ పిటిషన్ పై స్పందించాలని కోరింది ధర్మాసనం. ఇక కేజ్రీవాల్ పిటిషన్ పై తదుపరి విచారణ జూలై 15 కు వాయిదా వేసింది. కాగా ఢిల్లీ సీఎం కేజీవాల్ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. TDP MP తప్పుడు స్టేట్మెంట్ వల్ల నా భర్త జైల్లో ఉన్నారని ఢిల్లీ సీఎం కేజీవాల్ భార్య సునీత బాంబ్‌ పేల్చారు. తన భర్త రాజకీయ కుట్రకు బలి అయ్యారని ఢిల్లీ సీఎం కేజీవాల్ భార్య సునీత ఆరోపించారు. TDP పార్టీ MP మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. తన కొడుకు రాఘవను కాపాడుకునేందుకు శ్రీనివాసులు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అని పేర్కొన్నారు సునీత.

Read more RELATED
Recommended to you

Exit mobile version