కేంద్రంతో మా బంధం.. రాజకీయాలకు అతీతం: సీఎం జగన్‌

-

8 ఏళ్ల క్రితం ఏపీకి తగిలిన గాయం ఇంకా మానలేదని.. విభజనపై ప్రధాని మోడీ సమక్షంలో ఏపీ సీఎం జగన్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతం. పెద్ద మనస్సుతో మీరు చూపే ప్రేమ ప్రజలంతా గుర్తుపెట్టుకుంటారన్నారు.  విశాఖ బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసగించారు. ప్రతి కుటుంబం నిలదొక్కుకునేందుకే మా ఆర్థిక వ్యవస్థలో ప్రతి రూపాయి ఖర్చు చేస్తున్నామని.. ఏపీ చాలా ఇబ్బందుల్లో ఉందని పేర్కొన్నారు.

అయినా.. చాలా దైర్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తున్నామని చెప్పారు.
దేశప్రగతి రథసారథి.. మోడీ, విశాఖలో జనసముద్రం కనిపిస్తోంది.. 10వేల కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు విచ్చేసిన మోడీకి ధన్యవాదాలు అన్నారు సీఎం జగన్. ఏపీకి ఇంకా ఆర్థిక సాయం చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news