వినతుల పరిష్కారంలో మరింత మెరుగైన వ్యవస్థ : సీఎం జగన్‌

-

వినతుల పరిష్కారంలో మరింత మెరుగైన వ్యవస్థ కోసం.. స్పందనకు మెరుగైన రూపంపై అధికారులతో సీఎం జగన సమావేశం నిర్వహించారు. సీఎంఓ, ఉన్నతస్థాయి అధికారులతో పర్యవేక్షించేలా ప్రణాళిక రూపొందించారు. ముఖ్యమైన అధికారులతో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్షించారు. సమస్యలపై ప్రజలనుంచి వచ్చే వినతుల పరిష్కారం పై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. వ్యక్తులకు సంబంధించిన సమస్యలతోపాటు, కమ్యూనిటీకి సంబంధించిన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టామని, ఒక నిర్ణీత సమయం పెట్టుకుని వాటిని శరవేగంగా పరిష్కరించి ప్రజలకు అండగా నిలిచామన్నారు.

Andhra CM YS Jagan urges Union health minister to sanction medical colleges  in 12 districts - India Today

ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతోందని, స్పందనతోపాటు.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై కూడా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా దృష్టి పెట్టామన్నారు. అంతేకాకుండా.. ‘గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వాటిని పరిష్కరించేందుకు నిధులు కూడా కేటాయించాం, ఇంకా ఏమైనా సమస్యలు మిగిలిపోయి ఉన్నాయా? అన్నదానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. స్పందన కార్యక్రమాన్ని మెరుపరిచేలా ఆలోచన చేయాలి. సమస్యల పరిష్కారంలో అంకితభావానికి నిదర్శనంగా మనం నిలవాలి.

 

ప్రజల సమస్యలను తీర్చాలన్నదే మన ఉద్దేశం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత నిజాయితీగా, అంకిత భావంతో, కృతనిశ్చయంతో మనం ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేశాం. మనం అంతా కలిసికట్టుగా గతంలో ఎన్నడూలేని రీతిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.సమస్యల పరిష్కారంకోసం ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాల్లో వృత్తి నైపుణ్యం పెంచడం, నిర్మాణాత్మక రీతిలో వ్యవహరించడం అన్నదానిపై మనం దృష్టిసారించాల్సి ఉంది. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలనుకూడా పరిశీలించి అందులో ఎక్కడైనా స్వీకరించదగ్గవి ఉంటే… వాటిని కూడా స్వీకరించాలి. పథకాలు కావొచ్చు, రెవిన్యూ రికార్డులకు సంబంధించిన అంశాలు కావొచ్చు.. ఇలా ఏదైనా కావొచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news