ఈనెల 3న రాజమహేంద్రవరం పర్యటనకు సీఎం జగన్

-

ఈ నెల మూడో తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పర్యటనలో భాగంగా 13 రకాల పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులతో సభా స్థలం వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన తిలకించనున్నారు. అనంతరం లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ పర్యటన సందర్భంగా జనవరి 3వ తేదీన ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు సీఎం జగన్. 11:20 గంటల నుంచి 1.10 వరకు ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపుదల, లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం, అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగం, కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version