గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం జగన్ భావోద్వేగం…!

-

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Minister Gautham Reddy) ఇటీవల హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు, మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇప్పటికీ లేరన్న విషయం నమ్మలేకపోతున్నానని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. సోమవారం నెల్లూరులో జరిగిన గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొని మాట్లాడారు.

 

 

 

తనకు ప్రతి విషయంలోనూ గౌతమ్ రెడ్డి తోడుగా ఉండేవారన్నారు. చనిపోయే ముందు రోజు వరకు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకు రావాలనే తపనతో పని చేశారని భావోద్వేగానికి గురయ్యారు. తుదిశ్వాస వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకే కష్టపడిన గౌతమ్ రెడ్డికి ఇదే సరైన నివాళి అని ప్రభుత్వం భావిస్తోంది. సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి సంస్మరణార్థం ఆయన పేరు పెట్టామని గుర్తు చేశారు. గౌతమ్ రెడ్డి అందరి మనసుల్లో చిరస్థాయిగా ఉంటారని చెప్పారు. మంచి వ్యక్తిని కోల్పోయామని, గౌతమ్ రెడ్డి కుటుంబానికి వైసీపీ అన్ని రకాలుగా తోడుంటామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news