ఢిల్లీ బ్రోకర్లు..తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామనుకున్నారు – సీఎం కేసీఆర్

-

ఢిల్లీ బ్రోకర్లు..తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామనుకున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మునుగోడులోని చండూరు లో బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే చేనేత కార్మికుల కుటుంబాల నుంచి ఒక ఓటు కూడా బీజేపీకి ఓటు వేయొద్దు.. పాము కరుస్తుందని తెలిసి.. ఆ పాముకి ఓటు వేద్దామా? చేనేతలు బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు సీఎం కేసీఆర్.

ఒళ్లు మరిచిపోయి ఓటు వేస్తే… ఇళ్ళు కలిపోతదని మునుగోడు ప్రజలను కోరారు. దేశంలో ఏమి జరుగుతున్నది ? చేనేత వస్థ్రాలపై జీఎస్టీ, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారట…. కరిచే పాము అని తెలిసి మెడలో వేసుకుంటామా ? అని ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చి.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనాలని చూసిన.. దొంగలను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు సీఎం కేసీఆర్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news