తెలంగాణ “గీత కార్మికులకు” కేసీఆర్ మరో వరం.. !

-

తాజాగా కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుని ప్రజలకు శుభవార్తను అందించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం రైతులకు మాత్రమే భీమా అమలులో ఉంది, కానీ ఇకపై కళ్ళు గీత ద్వారా జీవనాన్ని సాగిస్తున్న కార్మికులకు కూడా భీమా అందించే దిశగా కేసీఆర్ ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ కార్మికులు కల్లు గీస్తూ ప్రమాదం జరిగి ప్రాణాలను కోల్పోతే వారికి రూ. 5 లక్షలు సాయం కింద ప్రభుత్వం అందించనుంది. ఈ బీమాపై పూర్తి వివరాలను మరియు విధివిధానాలను తయారుచేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మాములుగా అయితే ఇప్పటి వరకు అమలులో ఉన్న నష్టపరిహారం వివిధ కారణాల వలన ఆలస్యం అవుతుండడంతో, ఇంకా వేగంగా కార్మికులకు అందాలన్న మంచి ఉద్దేశ్యంతో ఈ పధకాన్ని సీఎం కేసీఆర్ అమలులోకి తీసుకోచ్చినట్లు తెలుస్తోంది. దీనితో కేసీఆర్ పై కల్లు గీత కార్మికులు ప్రసంశలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news