కేటీఆర్, కవిత సన్నిహితులకే లీజు : రఘునందన్

-

హైదరాబాద్ ORR లీజు కవిత, కేటీఆర్ సన్నిహితులకే దక్కిందని BJP MLA రఘునందన్ రావు ఆరోపించారు. ‘IRL కంపెనీ
రూ.7272 కోట్లకు మాత్రమే టెండర్ వేసింది. ప్రభుత్వం మాత్రం రూ.7380 కోట్లు వస్తాయని చెప్పింది. వేసిన బిడ్ కంటే IRL ఎందుకు ఎక్కువ ఇస్తోంది? టెండర్లు రద్దు చేయాలి. ఏప్రిల్ 11న ఓపెన్ చేసిన బిడ్ను ఏప్రిల్ 27 వరకు ఎందుకు వెల్లడించలేదు? బిడ్ ఓపెన్ చేశాక బేరమాడి IRLకే అప్పగించారా?’ అని ఆయన ప్రశ్నించారు.

Jubilee Hills gangrape case: BJP MLA Raghunandan Rao booked for revealing  rape victim's identity - Telangana Today

ఓఆర్ఆర్ కాంట్రాక్టు బిడ్ ను ఈ ఏడాది ఏప్రిల్ 11న తెరిచినట్టుగా రఘునందన్ రావు చెప్పారు. కానీ ఏప్రిల్ 27న ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీడియాకు ప్రకటన విడుదల చేశారని ఆయన గుర్తు చేశారు. బిడ్ ఓపెన్ చేసిన 16 రోజుల తర్వాత ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టారని ప్రశ్నించారు.

ఓఆర్ఆర్ పై బేస్ ప్రైజ్ ను నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిలైందని రఘునందన్ విమర్శించారు . కనీసం హెచ్ 1, హెచ్ 2, హెచ్ 2, హెచ్ 4 కంపెనీలు పిలిచి బేస్ ప్రైజ్ కు తక్కువగా బిడ్ కోడ్ చేసినందున టెండర్ ను క్యాన్సిల్ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే బాగుండేదన్నారు. ఓఆర్ఆర్ పై ఏప్రిల్ మాసంలో సగటున రూ. 2 కోట్ల 2 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news