జాతీయ రాజకీయాల్లోకి వస్తాం.. ఢిల్లీ కోటలు బద్దలు కొడుతాం- సీఎం కేసీఆర్

-

తెలంగాణకు మెడికల్ కాలేజీ ఇవ్వవు, ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ఇవ్వరు మీరు ఇవ్వకపోతే మంచిదే.. మాకు ఇచ్చే వాళ్లను అధికారంలోకి తీసుకువస్తాం… మిమ్మల్ని తరిమేస్తాం అంటూ బీజేపీ, ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. దేశంలో అనేక రాష్ట్రాల కన్నా ముందు వరసలో ఉన్నామన్నారు. అవసరమైతే దేశ రాజకీయాలను ప్రభావితం చేయాల్సి వస్తే.. తప్పకుండా ఈ దేశం కోసం పోరాటం చేయాలి అని అన్నారు. జాతీయ రాజకీయాల్లో పాత్ర వహిదాం అని.. సిద్దిపేట నుంచి మీరు నన్ను ఆశీర్వదించి పంపిస్తే తెలంగాణను సాధించామని..  మీరంతా దీవించడానికి రెడీగా ఉన్నాం.. ఇక్కడ మేము కొట్లాడుతాం అంటే.. నేను ఢిల్లీ కోటను బద్దలు కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు మాజోలికి వస్తే నశం చేస్తాం అని తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ యుద్దం చేసి పోరాటం చేసిన పార్టీ. మీ ఉడత బెదిరింపులకు భయపడేది లేదంటూ.. వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news