బొత్స కొడుకు పెళ్లికి కేటీఆర్..సెల్ఫీల కోసం ఎగబడ్డ జనాలు !

-

ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి బొత్స సత్య నారాయణ కుమారుడి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ కార్యక్రమం హైదరాబాద్‌ లోని ఓ ప్రముఖ కన్వెన్షన్‌ హాల్‌ లో జరిగింది. అయితే..ఈ వివాహ కార్యక్రమానికి… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తో పాటు.. ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ ప్రముఖులు హజరయ్యారు.

అలాగే.. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కూడా ఈ వివాహ కార్యక్రామానికి హాజరయ్యారు. ఇక ఈ నేపథ్యంలోనే.. ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాయుడు తదితర నాయకులతో… మంత్రి కేటీఆర్‌ సన్నిహితంగా మెలిగారు.

అనంతరం.. మంత్రి కేటీఆర్‌.. నూతన వధూవరులను.. ఆశీర్వదించారు. ఆ తర్వాత… మంత్రి కేటీఆర్‌ తో.. ఫోటోలు దిగేందుకు… యువకులు, ఇతరులు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ఇక అంతకు ముందు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.. కుటుంబ సమేతంగా.. పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news