దళితులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్… మార్చి తరువాత ప్రతీ నియోజకవర్గంలో 2 వేల మందికి

-

దళితులకు గుడ్ న్యూస్ చెప్పారు కేసీఆర్. శరీరంలో ఒక అవవయం మంచిగా లేకపోయినా.. శరీరం అంతా బాాగున్నట్లు కాదు. అలాగే దళితులు కూడా అభివ్రుద్ధి చెందినప్పుడే.. నిజమైన అభివ్రుద్ధి అని అన్నారు. కొంత మందికి దళిత బంధును చూస్తే చాలా మందికి కళ్లు మండుతున్నాయని విమర్శించారు. దళిత బంధు ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు వర్తిస్తున్నామని.. మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని.. ఏటా రెండు మూడు లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని ప్రకటించారు. ఈ మార్చి తరువాత ప్రతీ నియోజకవర్గంలో ప్రతీ రెండు వేల కుటుంబాలకు ఇస్తామని అన్నారు. ప్రతీ కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామని మరోసారి వెల్లడించారు. దళిత బంధులో రూ. 10 లక్షలు ఇవ్వడమే కాదు.. మెడికల్ షాపుల్లో, ఫర్టిలైజర్ షాపుల్లో, ప్రభుత్వ కాంట్రాక్ట్ లో, బార్, వైన్ షాపుల్లో రిజర్వేషన్ పెట్టాం అని చెప్పారు. ఇంతకు ముందు వీటిలో రిజర్వేషన్లు లేవని అన్నారు. ఇలా భారత దేశంలో ఎక్కడ లేవని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news