BREAKING : సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం..!

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మీడియా ముందుకు రాబోతున్నారు. ప్రగతి భవన్ లో మీడియా సమావేశం జరుగనుంది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ మీడియా సమావేశంలో పాల్గొంటుండటంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. గతంలో వరి ధాన్యంకొనుగోలు, యాసంగి సాగుపై కేసీఆర్ గతంలో కేసీఆర్ మీడియాతో పాల్గొన్నారు. ఆ సమయంలో బీజేపీపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

అయితే ఈరోజు మళ్లీ మీడియా సమావేశానికి రాబోతున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ పై మాట్లాడే అవకాశం ఉంది. తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి, ప్రభుత్వం ప్రతిపాదనలు చేసిన ప్రాజెక్ట్ లు వాటికి కేటాయింపులు లేకపోవడంపై మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను డొల్ల బడ్జెట్ గా సీఎం కేసీఆర్ అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతులను కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. మసిపూసి మారేడుకాయ చేసిన బడ్జెట్ అంటూ విరమ్శించారు. వ్యవసాయ రంగాన్ని అదుకోవడంతో కేంద్ర బడ్జెట్ చొరవ చూపలేదన్నారు.  కరోనా కష్టకాలంలో వైద్య రంగాన్ని ఆదుకోలేదని విమర్శించారు. దీంతో పాటు ఈ రోజు జరిగే మీడియా సమావేశంలో బడ్జెట్ లో కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాల మాట్లాడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news