మంత్రి అవంతి కాన్వాయ్ కింద పడి వ్యక్తి మృతి..ఇంటిని ముట్టడించిన బాధితులు !

-

విశాఖ : మంత్రి అవంతి శ్రీనివాస్ కాన్వాయ్‌ లోని ఓ వాహనం కింద పడి నిన్న సూర్య నారాయణ అనే వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. నిన్న సీఎం కాన్వాయ్‌ లో ఎయిర్‌ పోర్టు నుంచి.. వస్తుండగా.. మంత్రి అవంతి శ్రీనివాస్‌ వాహనం ఢీ కొనడంతో… సూర్య నారాయణ అనే వ్యక్తి మృతి చెందాడని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఇవాళ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటి ముందు మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిమంత్రి వాహనం ఢీకొనడంతోనే సూర్యనారాయణ మృతిచెందాడని ఆరోపణలు చేస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. సీసీ పూటేజీలో మంత్రి వాహనమే ఢీ కొట్టిందని బంధువులు చూసామని వెల్లడించారు. తమ కుటుంబానికి ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుడు సూర్యనారాయణ స్వస్థలం విజయనగరంజిల్లా గజపతినగరం. బాధితులు మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటి ముట్టడించడంతో… భారీగా మోహరించారు పోలీసులు. ప్రస్తుతం మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news