Revanth reddy: టెట్ వాయిదా వేయాలి రేవంత్ రెడ్డి డిమాండ్

-

కాంగ్రెస్ పార్టీ టెట్ వాయిదా వేయాలని పోరుబాటు పడుతోంది. తాజాగా ఎన్ ఎస్ యూ ఐ నేతలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్ ను అడ్డుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం టెట్ నిర్వహించే రోజే ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు పరీక్షలు ఒకే సారి ఉండటంతో టెట్ ను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తోంది. ఈ నెల 12 టెట్ పరీక్షను నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 

ఇదిలా ఉంటే టెట్ వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ ఆర్ఆర్బీ, టెట్ పరీక్షలు ఒకే రోజున ఉండటం వల్ల జాబ్ ఆశించేవారు వీటిలో ఒకదానికి మాత్రమే హాజరు కావాలి. ఆర్ఆర్బీ జాతీయ స్థాయి పరీక్ష, ఇక్కడ టెట్ రాష్ట్ర స్థాయి పరీక్ష అని, టెట్ మరొక తేదీన నిర్వహిస్తే ఇది ఔత్సాహికులకు సహాయపడుతుందని.. వెంటనే టెట్ వాయిదా వేాయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news