కాంగ్రెస్ పార్టీ నన్ను మోసం చేసింది: హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.

-

కాంగ్రెస్ పార్టీ నన్ను మోసం చేసింది అన్నారు హార్దిక్ పటేల్.గుజరాత్ లో కొన్నేళ్ళ క్రితం పటిదార్ల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సందర్భంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన హార్దిక్ పటేల్, 2019 లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు..ఆ తర్వాత చోటుచేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.నాటి నుంచి పెద్దగా బయటకే రాని హార్దిక్ పటేల్ బుధవారం అనూహ్యంగా బయటకు వచ్చారు.

ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానానికి బీజం వేసిన కాంగ్రెస్ పార్టీ పై ఆయన విమర్శలు గుప్పించారు.బుధవారం నాడు తన ఇంటిలో పలువురు మీడియా ప్రతినిధులను కలిశానని చెప్పిన హార్దిక్ పటేల్..తనను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. పటీదార్ల ఆందోళనలతో 2017 ఎన్నికల్లో బాగానే లబ్ధి పొందిన కాంగ్రెస్ పార్టీ తనను మాత్రం పక్కకు తప్పించేసిందని ఆయన తన ట్విట్టర్ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ పై ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news