టాలీవుడ్ లో మరో హీరోయిన్ కు కరోనా పాజిటివ్

-

కరోనాతో సినీ ఇండస్ట్రీ కరోనాతో అతలాకుతలం అవుతోంది. కరోనా థర్డ్ వేవ్ ఫిలిం ఇండస్ట్రీని కలవర పరుస్తోంది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కోవిడ్ బారిన పడింది. గతంలో టాక్సీవాలాలో విజయ్ దేవరకొండ సరసన నటించిన ఈ భామ, ఇటీవల ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో అభిమానులను ఆకట్టుకుంది. కరోనా సోకిన విషయాన్ని ప్రియాంక జవాల్కర్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలియజేసింది. 

ఇదిలా ఉంటే ఇటీవల పలువురు సిని ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో కరోనా కలకలం రేపింది. థర్డ్ వేవ్ మొదలయ్యాక ఇప్పటికే మహేష్ బాబు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, కీర్తి సురేష్, మీనా, త్రిష, సత్యరాజ్, ప్రియదర్శన్, విక్రమ్, వడివేలు వంటివారికి కరోనా సోకింది. వీరంతా ప్రస్తుతం కరోనా బారి నుంచి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news