BREAKING : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానాలు రద్దు

-

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానాలు రద్దు అయ్యాయి. అమెరికా 5G అమలులోకి తెస్తున్నందు వల్ల అమెరికా వెళ్లే కొన్ని విమానాలు రద్దు అయ్యాయి. దేశంలో పలు చోట్ల నుండి అమెరికాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలను కొన్నిటిని రద్దు చేసింది ఎయిర్ లైన్స్. ప్రయాణికులు ఎవరు ఎయిర్ పోర్ట్ కు వచ్చి ఇబ్బందులు పడకూడదు అని చెప్తుంది ఎయిర్ పోర్ట్ సిబ్బంది. ఈ రోజు సాయంత్రం, లేదా రేపు విమానాలు తిరిగి స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

అత్యవసరం గా వెళ్ళాలి అంటే వయా ఢిల్లీ నుండి వెళ్ళాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు. సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం తో నిన్న ఆందోళన కు దిగుతున్నారు ప్రయాణికులు. హైదరాబాద్ నుండి డైరెక్టుగా అమెరికా వెళ్లే విమానాలు లేవు. దీంతో వయా ఢిల్లీ వెళ్లే ప్రయాణికులకు ఎయిర్ లైన్స్ ద్వారా పంపింది ఎయిర్ పోర్ట్ సిబ్బంది… కొందరు ప్రయాణికులు ఇళ్లకు వెళ్లిపోయారు.. సుమారు 40 మంది ప్రయాణికులు వెళ్లేందుకు ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. కానీ విమానాలు రద్దు కావడంతో వెనుదిరిగారు.

 

Read more RELATED
Recommended to you

Latest news