తెలంగాణలో కొత్తగా 348 కరోనా కేసులు.. జీరో మరణాలు

-

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. క్రమంగా కరోనా తగ్గుముఖం పట్టింది. రోజు 500 లోపే కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా తీవ్రత పెద్దగా కనిపించడం లేదు. రాష్ట్రంలో థర్డ్ వేవ్ ముగిసిందని… తెలంగాణ ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 348 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 429 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో ఒక్క మరణం కూడా రికార్డ్ కాలేదు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.92 శాతంగా ఉంది. రాష్ట్రంలో 4396 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,87,785 మందికి కరోనా సోకగా 7,79,279 మంది రికవరీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4110 మంది కరోనాతో మరణించారు.

దేశంలో కూడా కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 30 వేల కన్నా దిగువనే ఉన్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా థర్డ్ వేవ్ దాదాపుగా అంతమైంది.

Read more RELATED
Recommended to you

Latest news