ఇండియాలో 69 శాతం మందికి కోవిడ్ టీకా.

-

వాక్సిన్ కార్యక్రమంలో భారత్ రికార్డులు స్రుష్టిస్తోంది. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటోంది . కరోనా విముక్త భారత్ వైపు అడుగులేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం ఇండియాలో 69 శాతం మంది వయోజనలకు కనీసం ఒక డోసు టీకా తీసుకున్నట్లు వెల్లడైంది. రెండు డోసులు తీసుకన్న వారు 25 శాతం మంది ఉన్నట్లు కేంద్రం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 64.1 శాతం, పట్టణ ప్రాంతాల్లో 35 శాతం మంది కోవిడ్ టీకాను  తీసుకన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కరోనా పరీక్షలపై కూడా ప్రభుత్వం ద్రుష్టి పెట్టింది. ప్రతీ రోజూ 15 లక్షల నుంచి 16 లక్షల పరీక్షలు చేస్తుందన ప్రభుత్వం తెలిపింది. అనవసర ప్రయాణాలు తగ్గించడం, పండగల సమయంలో రద్ధీ తగ్గడం వలన గత కొన్న రోజులుగా కరోనా వ్యాప్తి తగ్గిందని వెల్లడించింది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో కేరళ నుంచే ఎక్కువ వస్తున్నాయి. గత వారం ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 59.66 కేసులు నమోదవుతున్నట్లు కేంద్రం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news