హైదరాబాద్ లో మరో దారుణం.. ఓ అనాధ ఆశ్రమంలో మైనర్ బాలికపై లైంగిక దాడి!

-

హైదరాబాద్ నగరంలో మరో మైనర్ బాలిక పై లైంగిక వేధింపులు జరిగాయి. డీఏవి ఘటన మరువక ముందే మరో ఆశ్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నేరెడ్‌మెట్ జేజే నగర్ లోని గ్రేస్ అనాథాశ్రమంలో మైనర్ బాలిక పై లైంగిక వేధింపులు జరిగాయి. ఈ నెల 19న ఆశ్రమంలో నలుగురు యువతులుకనిపించకుండా పోయారు.

అందులో ఒకరు మేజర్, మరో ముగ్గురు మైనర్ ఉన్నారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు నేరెడ్‌మెట్ పోలీసులు.ఇద్దరిని సికింద్రాబాద్ లో, మరో ఇద్దరిని బంధువులు ఇంట్లో గుర్తించి సఖీ సెంటర్ కు తరలించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే సఖీ సెంటర్ లో లైంగిక దాడి విషయాన్ని చెప్పింది ఓ మైనర్‌ బాలిక. ఆశ్రమంలో అకౌంటెంట్ మురళి లైంగాక దాడికి పాల్పడినట్లు చెప్పింది బాలిక. ఇక బాలిక ఫిర్యాదు తో మురళి తో పాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news