BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది యాత్రికులు దుర్మరణం

-

దేశంలో ప్రతీరోజు ఎక్కడో ఓ చోట ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అతివేగం… అజాగ్రత్తం రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతోంది. ప్రమాదాల్లో కుటుంబాలకు కుటుంబాలే దుర్మరణం పాలవుతున్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదు.

అయితే.. తాజాగా ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం పీలీభీత్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా 10 మంది మృతి చెందారు. మరో 7 గురికి గాయలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గజ్రౌలా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో.. పికప్‌ ట్రక్కు చెట్టును ఢీ కొనగా. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షత గాత్రులను ఆస్పత్రికి తరలించారు. మొత్తం 18 మంది హరిద్వార్‌ లో స్నానం చేసి.. తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఇక ఈ ఘోర ప్రమాదంపై వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news