మూడో సంతానం ఆడపిల్ల.. ఆ కర్కోటక తండ్రి ఏం చేశాడంటే!

-

మగ సంతానం కోసం ఆరాటం కొంత మందిని కసాయిలుగా మారుస్తున్నది. అభం శుభం తెలియని ఆడ పిల్లల ఉసురుతీస్తున్నది. మూడోసారి ఆడపిల్ల పుట్టిందని కన్న తండ్రి కర్కోటకుడిగా మారాడు. మద్యం మత్తులో భార్యను చితకబాదాడు. ఆపై నెలల పసికందును రోడ్డుకేసి బాది ప్రాణాలను బలిగొన్నాడు. ఈ హృదయ విదారక సంఘటన కుమ్రం భీం జిల్లాలో చోటుచేసుకున్నది.

కుమ్రం భీం జిల్లా లైన్‌గూడలో నివసిస్తున్న మోస్రం బాపురావు, మనీషాలకు మౌనిక, అశ్విని అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మగ సంతానం కోసం ఆరాట పడ్డ బాపురావుకు 45 రోజుల క్రితం మళ్లీ ఆడపిల్లనే పుట్టడంతో నిరాశ చెందాడు. ఇక అప్పటి నుంచి రోజూ తప్పతాగి వచ్చి భార్యతో గొడవ పడుతున్నాడు.

యథావిధిగా సోమవారం రాత్రి కూడా ఫూటుగా మద్యం తాగి బాపురావు ఇంటికి వచ్చాడు. టీవీ చూడటం కోసం మౌనిక, అశ్వినిలు పక్కింటికి వెళ్లాడు. మూడో కూతురుని చూసిన బాపురావు విచక్షణను కోల్పోయాడు. భార్యను విపరీతంగా కొట్టడంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. అంతటితో ఆగని బాపురావు నెలల పసికందును బయటకు తీసుకువచ్చి నేలకేసి బాది ప్రాణాలను బలిగొన్నాడు. ఆ తర్వాత గ్రామ సర్పంచి ఇంటికి వెళ్లి విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. మంగళవారం వాంకిడి పోలీసులు బాపురావును అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఎవరికైనా ఇచ్చినా పెంచుకునే వారిమని అనవసరంగా పసికందు ప్రాణం తీశాడని గ్రామస్తులు వాపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news