బిజెపి బొక్క బోర్లా పడింది – దాసోజు శ్రవణ్

-

ఓట్ల లెక్కింపు సరిలి చేస్తుంటే టీఆరెస్ గెలుపు నల్లేరుమీద నడక అన్నట్లే కనిపిస్తోందన్నారు టిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. బీజేపీ చిల్లర పదాలు వాడుతూ ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కౌంటింగ్ హల్ లో ప్రతీ టేబుల్ పై బీజేపీ ఏజెంట్ ఉన్నారని.. టీఆరెస్ గెలుపు ధర్మబద్ధమైన గెలుపన్నారు. నైతికంగా గెలుపు అనే మాట వచ్చిందంటే బీజేపీ ఓడిపోతుందని అంగీకరించిందన్నారు.

బీజేపీ బొక్కబోర్ల పడిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలనే బీజేపీ కుట్రను మునుగోడు ప్రజలు బ్రేక్ వేశారని అన్నారు దాసోజు శ్రవణ్. 18వేల కోట్ల కాంట్రాక్టర్ కు చరమగీతం మునుగోడు ఫలితం కానుందన్నారు. చిల్లర ప్రయత్నాలతో బీజేపీ మైండ్ గేమ్ ఆడేందుకు కుట్ర చేయబోతోందని ఆరోపించారు దసోజు శ్రవణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version