అలవైకుంఠపురంలో సినిమాలో ఉన్న ఆ ఇల్లు ఎవరిదో తెలుసా..?

-

అల్లు అర్జున్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం అలా వైకుంఠపురంలో. ఈ సినిమా మొదట ఫ్లాప్ టాక్ ని తెచ్చుకొని ఆ తర్వాత మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 2020 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదల అయింది. ఇక ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించగా.. ముఖ్యమైన పాత్రలో టబు, జయరామ్ లు నటించారు. ఇక ఈ సినిమాకి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏమిటంటే ఇందులో వైకుంఠపురం లాంటి ఒక ఇల్లు ఉంది. ఈ సినిమాకి ఇదే కీలకంగా మారి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అయితే వీరు నివసించినట్లూ చూపించే ఇల్లు ఎవరిది అనే వెతికే ప్రయత్నంలో ఉన్నారు నెటిజన్స్. చివరికి ఆ ఇల్లు ఒక ప్రముఖ టీవీ ఛానల్ వ్యక్తిది అన్నట్లుగా తెలుస్తోంది. ఆ వ్యక్తి ఎవరో కాదు తుమ్మల నరేంద్ర చౌదరి కూతురు రచనా చౌదరి అత్తగారిల్లు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వీరు NTV అధినేత. ఇక ఈ సినిమా కోసం ఇల్లు చాలా స్పెషల్ గా కనిపించడం కోసం డైరెక్టర్ త్రివిక్రమ్ చాలా కాలం వెతికారట. కొన్ని రోజుల తర్వాత ఈ వైకుంఠపురం గురించి తెలిసి ఆ ఇంటిని సందర్శించిన త్రివిక్రమ్ షూటింగ్ చేసేందుకు ఇంటి యజమానులను ఒప్పించడం జరిగింది.అందుకోసం 20 రోజులపాటు ఆ ఇంటి పరిసరాలలో షూటింగ్ చేసినట్లుగా సమాచారం. ఈ సినిమా షూటింగ్ కోసం అల్లు అర్జున్ విలాసవంతమైన భవనానికి బాగా అట్రాక్ట్ అయ్యారు . ఆ తర్వాత అలాంటి అధునాతన వసతులతో ఒక భవనాన్ని నిర్మించాలనుకున్నట్లుగా ఒకానొక సందర్భంలో తెలియజేశారు. ఈ ఇంటి విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉన్నట్లుగా సమాచారం. అయితే ఎట్టకేలకు ఈ ఇల్లు ఎవరిదనే విషయం మాత్రం అటు అల్లు అర్జున్ అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలగజేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version