ఇంట్లో ధూపం ఎందుకు వేస్తారో తెలుసా? మంచి వాసన వెనుక అసలు పాయింట్ ఇది..!

-

సాంబ్రాణి ధూపం గురించి హిందువులకు బాగా తెలుసు. పూజగదిలోనే కాదు, ఆయుర్వేదంలోనే దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లో దూపం వేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పెద్దోళ్లు అంటారు. దేవునికి దూపం వేయటంతో ప్రారంభమైన అలవాటు ఆ తరువాత కాలంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ వస్తుంది. దేవునికి సాంబ్రాణి వేయటంలో ఉన్న ఆంతర్యం ఏంటో..ఆ ఆచారాన్ని ఎందుకు పెట్టారో ఇప్పుడు చూద్దాం.

ఇల్లు, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా, రోగరహితంగా, పరిమళ భరితంగా మార్చుకునేందుకు ఈ దూపం వేస్తారు. అయితే ప్రస్తుతం సాంబ్రాణి కడ్డీలు వెలిగించటం అందరికి అలవాటై పోయింది. పూర్వం సాంబ్రాణి, సుద్ధచందనాన్ని కలిపి ఆవు పిడకల్లోనో, గుగ్గిలంలోనో వెలిగించే వారు.
దోమలు, సూక్ష్మ క్రిములు వంటివి ఈ పొగ కారణంగా నిర్మూలించబడతాయని అప్పటి ప్రజలు నమ్మేవారు. ఈ దూపం పొడి హానికరమైన రసాయనాలు ఉపయోగించి తయారు చేయరు కాబట్టి.. దానిని నుండి వచ్చే పొగను పీల్చినా ఎలాంటి హాని జరగదు. ఒకప్పుడు బొగ్గులు వెలిగించి దానిపై సాంబ్రాణి పొడిని చల్లుతారు. అయితే ప్రస్తుతం మార్కెట్లోకి ధూప్ స్టిక్స్ అందుబాటులోకి వచ్చేశాయి.

సాంబ్రాణి దూపం వల్ల ఉపయోగాలు:

పరిసరాలను క్రిమి కీటకాలు లేకుండా ఉంచేందుకు ఈ దూపం దోహదపడుతుంది.

ఇంట్లో సాంబ్రాణి దూపం వేయటం వల్ల మనస్సు ఉల్లాసంగా, ప్రశాతంగా ఉండేలా చేస్తుంది.

ముఖ్యంగా బాలింతలకు, శిశువులకు సాంబ్రాణి దూపం వేస్తారు.

శ్వాస సంబంధిత రుగ్మతలు లేకుండా ఈ దూపం చేస్తుంది.

పసిపిల్లలకు స్నానం చేసిన తరువాత దూపం వేయటం వల్ల ఆకలితోపాటు వారు హాయిగా నిద్రించేలా చేస్తుంది.

జలుబు దగ్గు వంటి సమస్యలు దరిచేరవు.

శరీరంలో నీరసాన్ని తగ్గించి నరాలను ఉత్తేజితం చేస్తుంది.

అనేక మానసిక రుగ్మతలకు సాంబ్రాణి దూపం మందులా పనిచేస్తుంది.

సాంబ్రాణి ఆయుర్వేదంలో కీళ్ళనొప్పుల నివారణకు జీర్ణక్రియ, చర్మ రోగాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు.

సాంబ్రాణి ఆస్తమా, అల్సర్, క్యాన్సర్ చికిత్స కోసం వినియోగించే మందుల్లో ఉపయోగిస్తారు.

సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవని చెబుతుంటారు.

ప్రస్తుతం మార్కెట్లలో పొడి రూపంలో సాంబ్రాణి లభిస్తుంది.

తల స్నానం చేసిన తరువాత సాంబ్రాణి దూపం వేయటం వల్ల తల త్వరగా ఆరటమే కాకుండా కుదుళ్ళ ఆరోగ్యానికి మంచికలుగుతుంది.

ఇంట్లో సాంబ్రాణి దూపం వేయటం వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

దూపం వేసినప్పుడు వచ్చే వాసన నాడిని ప్రేరేపించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

ఇళ్లు శుభ్రం చేసుకున్నప్పుడు ఇంట్లో ధూపం వేసుకుంటే..మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా ఈసారి ట్రై చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news