రేపు తిరుపతి గోవిందదామంలో డాలర్ శేషాద్రి అంత్యక్రియలు

-

రేపు తిరుపతి గోవింద దామంలో డాల్లర్ శేషాద్రి అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే…. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మార్గాన వైజాగ్ నుంచి తిరుపతికి శేషాద్రి పార్దివదేహాన్ని తీసుకెళ్లనున్నారు. ఇవాళ అర్దరాత్రికి తిరుపతికి ఆయన పార్దివదేహం చేరుకోనుంది. రేపు ఉదయం ప్రజల సందర్శనార్దం తిరుపతిలో సిరిగిరి అపార్ట్మెంట్ లో పార్దీవదేహన్ని ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

ఇక రేపు మధ్యహ్నం 2 నుంచి 3 గంటలకు వరకు పూజలు నిర్వహించిన అనంతరం…తిరుపతి గోవిందదామంలో అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి. కాగా.. టీటీడీ‎ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం బాధాకరమన్నారు చంద్రబాబు. ఉదయాన్నే ఆయన మరణ వార్త తీవ్రంగా కలిచివేసిందని… ఆయన మృతి టీటీడీకి తీరనిలోటని తెలిపారు. డాలర్ శేషాద్రి నిత్యం వేంకటేశ్వర స్వామి సేవలో తరించేవారని… ఆయన టీటీడికి విశేషమైన సేవలందించారని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news