మంచిరెడ్డి కిష‌న్ రెడ్డిని ఏకంగా 10 గంట‌లు విచారించిన ఈడీ

-

విదేశాల్లో పెట్టుబ‌డులు పెట్టే క్ర‌మంలో ఫెమా నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డిని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు వ‌రుస‌గా రెండో రోజు బుధ‌వారం కూడా విచారించారు. తొలి రోజైన మంగ‌ళ‌వారం 9 గంట‌ల పాటు మంచిరెడ్డిని విచారించిన ఈడీ… రెండో రోజైన బుధ‌వారం ఏకంగా 10 గంట‌ల పాటు ఆయ‌న‌ను విచారించింది. సుదీర్ఘంగా కొన‌సాగిన విచార‌ణ‌లో భాగంగా విదేశాల్లో పెట్టుబ‌డులు, ఫెమా నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌పై ఈడీ అధికారులు మంచిరెడ్డిని ప్ర‌శ్నించారు.

TRS MLA questioned by ED in FEMA case

 

అంతేకాకుండా మంచిరెడ్డి బ్యాంకు లావాదేవీల‌పైనా ఈడీ అధికారులు దృష్టి సారించారు. ప‌లు బ్యాంకు లావాదేవీల‌పై మంచిరెడ్డి నుంచి స‌మాధానాలు రాబ‌ట్టారు. బుధ‌వారం విచార‌ణ ముగిసింద‌ని చెప్పిన ఈడీ అధికారులు.. అవ‌స‌ర‌మ‌నుకుంటే గురువారం కూడా విచారణ‌కు రావాల్సి ఉంటుంద‌ని మంచిరెడ్డికి తెలిపిన‌ట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news