మాజీ సీఎం కేసీఆర్‌కు ఈడీ షాక్.. ఆ స్కాంలో కేసు నమోదు!

-

గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్‌కు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాక్ ఇచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన జీఎస్టీ చెల్లింపుల కుంభకోణంపై ఈడీ అధికారులు తాజాగా కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జీఎస్టీ చెల్లింపుల్లో రూ. 46 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే దీనిపై హైదరాబాద్ CCSలో పోలీసులు కేసు నమోదు చేశారు.

మాజీ ప్రభుత్వ కార్యదర్శి నేతృత్వంలో ఈ జీఎస్టీ కుంభకోణం జరిగినట్టు అధికారులు తేల్చారు.గత ప్రభుత్వం అనర్హులకు జీఎస్టీ చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. దీంతో ఇందులో హస్తం ఉన్న వారికి ఈడీ తాజాగా నోటీసులు పంపిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్‌కు సైతం ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం లేకపోలేదని సమాచారం. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version