Breaking News : గ్రూప్‌-1 అభ్యర్థులకు శుభవార్త.. ఎడిట్‌ అవకాశం..

-

తెలంగాణ ప్రభుత్వం గ్రూప్‌ -1కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గ్రూప్‌-1 పోస్టలు భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో.. ఈ మధ్యనే నోటిఫికేషన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే అభ్యర్థుల అభ్యర్థన మేరకు దరఖాస్తుల్లో చేర్పులు మార్పులు చేసుకునేందుక ఎడిట్‌ అప్షన్‌ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈనెల 19 నుండి 21 వరకు దరఖాస్తులలో పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థుల అభ్యర్థన మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది.

TSPSC Group 1 recruitment process begins, over 13K applications received

అయితే.. ఎడిట్ చేసుకుంటే సంబంధిత డాక్యుమెంట్స్‌ని ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సూచించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. తెలంగాణ గ్రూపు-1 రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి దరఖాస్తుల గడువు జూన్‌ 4తో ముగిసింది. జూన్‌ 4వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించేందుకు టీఎస్‌పీఎస్సీ అనుమతించిన విషయం తెలిసిందే. వాస్తవానికి మే 31 అర్ధరాత్రి వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువు విధించిన నేపథ్యంలో.. చివరి రోజు 50 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news