ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించడమే నా ప్రధాన ఎజెండా: ఈటల రాజేందర్

-

కాసేపటి క్రితం బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రచారం కార్యక్రమాలను పూజలు చేసి ప్రారంభించారు. జమ్మికుంట మండలం నాగారం లోని అంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు, ఈటల రాజేందర్ గజ్వేల్ మరియు హుజురాబాద్ నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో నా ప్రధాన రాజేంద్ర ఒక్కటే సీఎం కేసీఆర్ ను ఓడించడం అంటూ డైరెక్ట్ గా కామెంట్ చేశారు ఈటల. కేసీఆర్ మద్యాన్ని డబ్బును నమ్ముకుని ఎన్నికలకు వెళుతున్నాడు, కానీ ప్రజల విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టి ఎన్నికలకు వెళుతున్నాము అంటూ ఈటల చెప్పారు. గజ్వేల్ లో సభను పెడితే లక్షల మంది ప్రజలు వచ్చారు, అభిమానాన్ని అడ్డుకోవడానికి కేసీఆర్ చిల్లర పనులన్నీ చేశారు అంటూ ఈటల కామెంట్ చేశాడు.

ముఖ్యంగా గజ్వేల్ లో ర్యాలీ చూసి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి అంటూ ఈటల చెప్పాడు. ప్రతి ఏటా మద్యం ద్వారా
45 వేల కోట్లు దోచుకుంటున్నారు అంటూ ఈటల రాజేందర్ కామెంట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version