భారత్​లో రెండు ట్విటర్ ఆఫీసులను మూసేసిన మస్క్

-

ట్విటర్​ను హస్తగతం చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ ఆ సంస్థలో పెను మార్పులు తీసుకువస్తున్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారిని తొలగించడం నుంచి ట్విటర్ గైడ్​లైన్సులో మార్పుల వరకు మస్క్ చేస్తోన్న ప్రతీది సెన్సేషనే క్రియేట్ చేస్తోంది. అయితే నష్టాల్లో ఉన్న కంపెనీని గట్టెక్కించేందుకు ఇప్పటికే మస్క్ చాలా మంది ఉద్యోగులను తొలగించారు. ఇప్పుడు ఏకంగా రెండు కార్యాలయాలకు తాళమేశారు.

భారత్​లో ఖ‌ర్చులు త‌గ్గించాల‌న్న ఉద్దేశంతో గతేడాది ట్విటర్ ఇండియా నుంచి 90 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కంపెనీకి సంబంధించి ఇండియాలో ఉన్న మూడు కార్యాలయాల్లో దిల్లీ, ముంబయిల్లో ఉన్న రెండింటిని మూసివేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది.

ప్రస్తుతం కేవ‌లం బెంగుళూరులో ఉన్న ఆఫీసు నుంచి మాత్ర‌మే ట్విటర్ త‌న కార్య‌క‌లాపాల్ని కొన‌సాగిస్తోంది. అక్క‌డ ఎక్కువ శాతం మంది ఇంజినీర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version