ఈటల రాజేందర్ ను బలవంతంగా అసెంబ్లీ నుంచి తీసుకెళ్లిన పోలీసులు

-

BREAKING : అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోనే.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్‌ ను సస్పెండ్‌ చేస్తూ.. నిర్ణయం తీసుకున్నారు స్పీకర్‌ పోచారాం శ్రీనివాస్‌. అయితే.. సస్పెన్సన్‌ అనంతరం.. ఈటల రాజేందర్‌ ను బలవంతంగా పోలీసులు తీసుకెళ్లారు. బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి అసెంబ్లీ నుండి తీసుకొని పోయారు.

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్… బానిసలా వ్యవహరించవద్దు అంటూ పోలీసులపై నిప్పులు చెరిగారు. మీ నాశనానికి ఇదంతా చేస్తున్నారు… సంవత్సర కాలంగా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరుకాకుండా చేస్తున్నారు… గొంతు నొక్కుతున్నారని విమర్శలు చేశారు. గద్దె దించే వరకు విశ్రమించను…మీ తాటాకు చప్పుళ్లకు భయపడనని హెచ్చరించారు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news