టిఆర్ఎస్ నేతలు బావిలో కప్పలు – ఈటల రాజేందర్ సంచలనం

-

టిఆర్ఎస్ నేతలు బావిలో కప్పలా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బిజేపీ వార్తలు రాకుండా కట్టడి చేయాలని వికృత చేష్టలకు దిగారని… బిజేపీ పండగ వాతావరణం చెడగొట్టే ప్రయత్నం చేశారని ఫైర్‌ అయ్యారు.

టిఆర్ఎస్ భ్రమలు ఎంతోకాలం ఉండవని… ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మా పార్టీ అధిష్టానం ఆదేశించిందని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలో, జాతీయ పార్టీలో ఉండే తేడాను గమనించానని.. ప్రాంతీయ పార్టీలో వ్యక్తి కేంద్రంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. జాతీయ పార్టీలో అందరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉందని… స్ట్రాటజీ అమలు పై సూచనలు చేశారని వెల్లడించారు.

యువత లో చైతన్యం నిన్న సభలో స్పష్టంగా కనిపించిందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని జెపీ నడ్డా తెలిపారని.. నిన్నటి ప్రధాని సభ గ్రాండ్ సక్సెస్ అయిందని పేర్కొన్నారు ఈటల. బోనాలకు వచ్చినంత జనాలు రాలేదని రాష్ట్ర మంత్రులు మాట్లాడడం వారి అవివేకమని.. పార్టీ మీటింగ్ ని బోనాలతో పోల్చడం దుర్మార్గమని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news