Breaking : ఓయూ విద్యార్థులకు అలర్ట్‌.. పరీక్షలు వాయిదా..

-

తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండిపోవడంతో గండిపడి వరద నీరు గ్రామాల్లోకి వచ్చి చేరుతోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే.. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది.

ఈ నేపథ్యంలోనే ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఓయూ పరిధిలోని అన్ని కళాశాలలకు 11.07.2022 నుండి 13.07.2022 వరకు సెలవులు ప్రకటించింది. ఇంకా 11.07.2022 నుండి 13.07.2022 వరకు షెడ్యూల్ చేయబడిన అన్ని పరీక్షలు వాయిదా వేయబడినట్లు మరియు ఈ వాయిదా పడిన పరీక్షల కోసం రీషెడ్యూల్ చేయబడిన టైమ్‌టేబుల్‌ను తగిన సమయంలో ఓయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతానికి 14.07.2022 నుండి ఇతర పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని
వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version