ఏపీ మంత్రి వర్గ కూర్పు పై కసరత్తు..!

-

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇక సీఎంగా చంద్రబాబు.. మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే మంత్రి వర్గ కూర్పు పై కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. ముఖ్యంగా మంత్రి వర్గంలో బీసీలకే అధిక ప్రాధాన్యత కేటాయించనున్నట్టు తెలుస్తోంది.

అలాగే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. జనసేనకు 3 లేదా 4 మంత్రి పదవులు.. బీజేపీకి 2 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కి పర్యావరణ శాఖ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే లోకేష్ కి ఐటీ లేదా హోంశాఖ బాధ్యతలను అప్పగించనున్నట్టు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు ఆయా జిల్లాలకు సంబంధించిన సీనియర్లకు మంత్రి పదవులు దక్కనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా సుజనాచౌదరి, సత్యకుమార్, విష్ణు కుమార్, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ తో పాటు కొణతాళ్ల రామకృష్ణ, నాదెండ్ల మనోహర్ వంటి వారికి మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక టీడీపీ నుంచి భారీగానే మంత్రి పదవులను ఆశిస్తున్నారు. మరి వారిలో ఎవరెవరికీ కేటాయిస్తారో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news