ఫ్యాక్ట్ చెక్: ఆధార్ కార్డు ఉంటే 2 శాతం వడ్డీకే రుణం వస్తుందా..? సబ్సిడీ కింద 50 శాతం లోన్ డబ్బులు మాఫీ చేస్తారా..? నిజమెంత…?

-

మనకి ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్లులలో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. అయితే ఆధార్ కార్డు లేకపోతే చాలా పనులు కూడా ఆగిపోతాయి. ఇదిలా ఉంటే తాజాగా ఒక స్కీమ్ గురించి సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. అయితే మరి ఆ స్కీమ్ గురించి… ఇందులో నిజమెంత అనేది దాని గురించి చూద్దాం.

కేంద్ర ప్రభుత్వం కేవలం రెండు శాతం వడ్డీ రేటుకే రుణాలు ఇస్తోందని సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. పైగా ఈ డబ్బులు పై సగం సబ్సిడీ కూడా లభిస్తోందని అందులో ఉంది. అయితే నిజంగా కేంద్ర ప్రభుత్వం ఈ బెనిఫిట్ ని ఇస్తోంది..? నిజం ఎంత అనేది చూస్తే… ఆధార్ కార్డు కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వం రెండు శాతం వడ్డీకే రుణాలు ఇవ్వడంలో నిజం లేదు, ఇది కేవలం వట్టి ఫేక్ వార్త.

అలానే లోన్ సబ్సిడీ కూడా లభిస్తుంది అన్నది కూడా అబద్ధమే. అనవసరంగా ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మి మోసపోవద్దు. మోసగాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని స్వయంగా పీఐబీ ఫ్యాక్ట్ చెప్పింది. ఇలాంటి స్కీమ్స్ ఏమీ లేవని… కేంద్రం ఇలాంటి స్కీమ్స్ ని తీసుకు రాలేదని చెప్పింది. ఒకవేళ కనుక మీరు నమ్మరు అంటే మీ బ్యాంకు ఎకౌంట్ ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దు. అదే విధంగా ఎవరికి షేర్ చేయొద్దు కూడా.

Read more RELATED
Recommended to you

Latest news