షర్మిలకు కేసీఆర్ ఒక్కడే దెయ్యంలా కనిపిస్తున్నాడు – తమ్మినేని

-

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలనడం సరైనది కాదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. షర్మిలకు కేసీఆర్ ఒక్కడే దయ్యంలా కనిపిస్తున్నాడని.. కేంద్రంలో ఉన్న బిజెపి పైన ఒక మాట కూడా షర్మిల మాట్లాడడం లేదని మండిపడ్డారు.

భాజపా కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఎం జన చైతన్య యాత్ర చేపడుతుందన్నారు. మూడు బృందాలుగా 33జిల్లాల్లో ఈ యాత్ర సాగుతందని వివరించారు. మొదటి యాత్ర మార్చి 17న వరంగల్ నుంచీ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, ఈ యాత్రను సీతారాం ఏచూరి ప్రారంభిస్తారని వెల్లడించారు. రెండవ యాత్ర మార్చి 23 అదిలాబాద్ లో ప్రారంభమవుతుందన్నారు. ఈ యాత్రను బీవీ రాఘవులు ప్రారంభిస్తారని తెలిపారు తమ్మినేని వీరభద్రం.

మూడవ యాత్రను మార్చి 24న నిజామాబాద్ లో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు విజయ రాఘవన్ ప్రారంభిస్తారని అన్నారు. మార్చి 29న ఇందిరా పార్క్ వద్ద యాత్ర ముగింపు సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ ముగింపు సభకి ప్రకాశ్ కారత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఇక ఎన్నికల నాటికి పోటీ, పొత్తులపై నిర్ణయిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news