గుడ్ న్యూస్.. తెలంగాణలో ఉచిత రేషన్ పంపిణీ

-

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవ్వాల్టి నుంచి తెలంగాణలో మరో విడత మనిషికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన చేశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.83 కోట్ల మంది లబ్ధిదారులలో కేంద్ర ప్రభుత్వం కేవలం 1.91 కోట్ల మందికి మాత్రమే ఐదు కిలోల చొప్పున ఉచిత రేషన్ అందిస్తోందని… మిగతా 35 లక్షల కార్డులు, 91 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి వ్యయంతో ఉచిత రేషన్ సరఫరా చేస్తుందని వివరించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలకు ఉచిత రేషన్ పంపిణీ పొడగించిందని ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కార్డుదారులకే 19వేల లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news