తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్స్

-

వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్స్ వస్తాయని.. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు. ఉప్పల్ నియోజికవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు జూబ్లీహిల్స్ మహాప్రస్థానం ఒక్కటే బాగుంటుండే, ఇప్పుడు ప్రతి చోట నిర్మిస్తున్నామని.. హైదరాబాద్ లో 3860 కోట్ల రూపాయలతో STP లు నిర్మిస్తున్నామని చెప్పారు.

రూ. 460 కోట్లతో ఉప్పల్ చౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నామని.. 35 కోట్లతో ఉప్పల్ చౌరస్తాలో స్కై వాక్ నిర్మిస్తున్నాం… వచ్చే నెలలో నేనే ప్రారంభిస్తానని ప్రకటన చేశారు. 7300కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం… జూన్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఉందన్నారు.

టిమ్స్ కూడా ఉప్పల్ కి దగ్గర్లోనే రాబోతుంది… హైదరాబాద్ లో 75వేల ఇండ్లు కట్టుకుంటున్నామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు అవ్వగానే వాటిని లబ్దిదారులకు ఇస్తాం… కులం మతం అనే పిచ్చి, పంచాయితీ లేకుండా అందరికి పథకాలు, ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.నిరుద్యోగ సోదరుల కోసం ఒకేసారి 90వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news