నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. గ్రూప్ ఉద్యోగాల‌ భ‌ర్తీకి జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు జ‌గ‌న్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్స్ ఉద్యోగాల భ‌ర్తీకి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌చ్చ జెండా ఊపింది. జాబ్ క్యాలెండ‌ర్ కంటే.. అద‌నంగా ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాడానికి రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో గ్రూప్ – 1, గ్రూప్ – 2 పోస్టుల భ‌ర్తీకి రోడ్ క్లీర్ అయింది. కాగ ఆంధ్ర ప్ర‌దేశ్ లో జాబ్ క్యాలెండ‌ర్ కాకుండా.. గ్రూప్ – 1 కేట‌గిరి కింద‌.. 110 ఉద్యోగాలు, గ్రూప్ – 2 కేట‌గిరి కింద 182 ఉద్యోగాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ల‌భించింది.

ప్ర‌భుత్వ అనుమ‌తి రావ‌డంతో అతి త్వ‌ర‌లోనే.. ఏపీపీఎస్సీ ద్వారా ఈ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల కానుంది. కాగ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన ఉద్యోగాల్లో.. గ్రూప్ – 1 విభాగంలో డిప్యూటీ క‌లెక్ట‌ర్, ఆర్డీవో, డీఎస్పీ, సీటీవో, డీఎఫ్ఓ, మున్సిప‌ల్ క‌మిషన‌ర్, ఎంపీడీవో ఉద్యోగాలను భ‌ర్తీ చేయ‌నున్నారు. అలాగే గ్రూప్ – 2 విభాగంలో డిప్యూటీ త‌హ‌సీల్దార్లు, స‌బ్ రిజ‌స్ట్రార్లు, ట్రెజ‌రీ అధికారులు తో పాటు మ‌రి కొన్ని ఖాళీల‌కు నోటిఫికేషన్ విడుద‌ల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news